అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన తెలంగాణ విద్యార్థుల మృతదేహాలను వారి స్వస్థలం నల్గొండ జిల్లా ఆడిశర్లపల్లి మండలం గుర్రపుతండాకు తరలిస్తున్నారు. అమెరికా నుంచి వారి మృతదేహాలను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు తీసుకొచ్చారు. ఆ తర్వాత మూడు అంబులెన్స్ ల్లో వారి డెడ్ బాడీలను సొంత ప్రాంతానికి తరలించారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లిన సాత్వికా శరణ్, అరుణ్ సుహాస్ నాయక్, సుచరితా నాయక్ అగ్నిప్రమాదంలో చిక్కుకుని మరణించారు. క్రిస్మస్ పండుగ రోజు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.