కేపీహెచ్‌బీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దారుణ హత్య

హైదరాబాద్‌ కూకట్‌పల్లి హౌజింగ్‌ బోర్డ్‌లో సతీశ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. మూడు రోజుల క్రితం అదృశ్యమైన సతీశ్.. ఓ ఇంట్లో శవమై కనిపించాడు.

Update: 2019-08-30 04:32 GMT

హైదరాబాద్‌ కూకట్‌పల్లి హౌజింగ్‌ బోర్డ్‌లో సతీశ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. మూడు రోజుల క్రితం అదృశ్యమైన సతీశ్.. ఓ ఇంట్లో శవమై కనిపించాడు. ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన సతీశ్‌.. కేపీహెచ్‌బీలో ఉంటున్నాడు. తన ఫ్రెండ్‌ హేమంత్‌తో కలిసి మూసాపేట్‌లో ఓ ఐటీ కంపెనీ ఏర్పాటు చేసి నడుపుతున్నాడు. వ్యాపారంలో లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. మృతదేహంపై కత్తిపోట్లను గుర్తించిన పోలీసులు డెడ్‌బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించాడు. అయితే నిన్ననే సతీశ్‌ భార్య ప్రశాంతి ఫిర్యాదు చేసింది. ఇందులో భాగంగా సతీశ్‌ స్నేహితుడిపైనే తనకు అనుమానం ఉందని పేర్కొంది. ఆమే మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 



 


Tags:    

Similar News