గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం..

Update: 2019-04-25 07:20 GMT

గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం చోటు చేసుకుంది. సాయి సాత్విక్ అనే ఏడేళ్ల బాలుడిని గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా చంపి.. క్వారీలో పడేసి వెళ్లిపోయారు. ఈనెల 22న సాయంత్రం మాచర్ల నెహ్రూ నగర్‌లో ఆరు సంవత్సరాల సిద్ధు సాయి సాత్విక్ కిడ్నాప్ అయ్యాడు. ఈ విషయాన్ని రైల్వే స్టేషన్‌లోని సీసీ టీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు మాచర్ల సమీపంలోని ఓ క్వారీలో బాలుడి మృతదేహం ఉందని తెలుసుకున్నారు. కన్న బిడ్డ మరణవార్త తెలుసుకున్న బాలుడితల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.




 


Similar News