వివేకా హత్య కేసులో సిట్ విచారణ వేగవంతం...వివేకా హత్య తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన పరమేశ్వర్రెడ్డి
వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. నిన్నంతా వివేకా సోదరులను విచారించిన సిట్ ఇవాళ వివేకానందరెడ్డి అనుచర వర్గంపై కూడా దర్యాప్తు చేస్తోంది. సింహాద్రిపురం మండలం కసునూరుకు చెందిన పరమేశ్వర్రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఇటీవలే వైసీపీలో చేరిన పరమేశ్వర్రెడ్డి వివేకానందరెడ్డికి సన్నిహితంగా మెలిగినట్లు గుర్తించారు. అయితే వివేకా హత్య తర్వాత పరమేశ్వర్రెడ్డి కనిపించకుండా వెళ్లిపోయారు. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న పరమేశ్వర్రెడ్డికి గతంలో బీటెక్ రవితో గొడవలు కూడా జరిగాయని గుర్తించారు. ఈ గొడవల్లో ఇరు కుటుంబాల్లోనూ ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయని చెబుతున్నారు. అయితే భార్య పిల్లలతో సహా పరమేశ్వర్రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఆయన్ని గుర్తించే పనిలో పడ్డారు. ఆయన దొరికితే ఈ హత్య కేసులో మరిన్ని ఆధారాలు లభించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.