ఏడాదిగా టెన్త్ విద్యార్థిపై లైంగిక దాడి..

మహిళాలపై లైంగిక దాడులు, అత్యాచారాలు జరుగుతునే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చిన కానీ మనవ మృగాలకు బలికాక తప్పడం లేదు. ఈ క్రమంలో అబ్బాయిలపై కూడా అక్కడక్కడ మగవాళ్లపై అత్యాచారాలు జరుగుతున్నాయి.

Update: 2019-09-01 06:10 GMT

మహిళాలపై లైంగిక దాడులు, అత్యాచారాలు జరుగుతునే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చిన కానీ మనవ మృగాలకు బలికాక తప్పడం లేదు. ఈ క్రమంలో అబ్బాయిలపై కూడా అక్కడక్కడ మగవాళ్లపై అత్యాచారాలు జరుగుతున్నాయి. తాజాగా టెన్త్ విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడ ఘటన హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ భవానీనగర్‌లో నివసించే బాలుడు చాంద్రాయణగుట్టలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. అయితే అదే పాఠశాలలో టెన్త్ చదువుతున్న మరో ముగ్గురు బాలురు అతడిని బెదిరించి ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు.

ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో వారి పైశాచికత్వాన్ని బాలుడు మౌనంగా భరిస్తున్నాడు. ఇటీవల బాలుడిని చూసేందుకు హాస్టల్‌కు వచ్చాడు అతడి తండ్రి. అయితే తన కుమారుడు నీరసంగా కనిపించడంతో ఏం జరిగిందని ఆరా తీసాడు. ఏం లేదని చెప్పుకొచ్చాడు ఆ బాలుడు. దీంతో తన తండ్రి గట్టిగా అడిగేసరికి అసలు విషయం చెప్పాడు. దీంతో బాధితుడి తండ్రి చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Tags:    

Similar News