దొంగతనం చేసి గుడ్ మార్నింగ్ చెప్పి వెళ్ళిపోయాడు...

Update: 2019-10-14 11:36 GMT

ఓ దొంగ ఇంట్లో దర్జాగా దొంగతనం చేసాడు... ఆ ఇంటి యజమానికే శుభోదయం అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ ఘటన శ్రీకాకుళంలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళంలో నివాసం ఉంటున్న వాడ్రంగి శ్రీనివాస్ రావు అనే వ్యక్తి వ్యకిగత పనుల కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అతని ఇంటిపైనే అతని తల్లి దమయంతి ఉంటుంది. కానీ ఆమె వెళ్ళలేదు. దీనితో నిన్న (ఆదివారం) వేకువజామున మూడు గంటల సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇంటిముందు దమయంతికి కనిపించడంతో ఎవరు నువ్వు శ్రీనివాస్ రెడ్డి పడుకోమన్నడా అని అడిగింది. దీనితో ఆ వ్యక్తి అవును అని చెప్పి ఆమెకి శుభోదయమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

ఇక ఉదయం ఐదు గంటల ప్రాంతంలో పాలు పోసేందుకు ఓ మహిళ ఇంటికి రాగా ఇంట్లో లైట్స్ వెలుగుతూ ఉండడం, తాళాలు విరిగిపోవడం గమనించి ఇంటి యజమాని దమయంతికి చెప్పడంతో వెంటనే ఆమె తన కుమారుడికి సమాచారం అందించింది. శ్రీనివాస్ రెడ్డి అక్కడికి చేరుకొని జరిగినదానిపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. జరిగిన దొంగతనంలో 32 తులాల బంగారం ,ఆరు లక్షల రూపాయలు, మూడు తులాలు బంగారం వెండి ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. తెలిసిన వ్యక్తినే ఈ పని చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 

Tags:    

Similar News