డ్రైవర్ నిర్లక్ష్యంతో రోడ్డు ప్రమాదం: 36 మందికి తీవ్ర గాయాలు

Update: 2019-07-02 02:59 GMT

గుంటూరు జిల్లాలోని నర్సారావుపేట దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూల్ నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో 36 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Tags:    

Similar News