పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం
రంగారెడ్డి జిల్లా కొత్తూరు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకదాని వెనుక మరొక వాహనాలు ఢీకొన్నాయి. పొగమంచు కారణంగా రూట్ క్లియర్గా లేకపోవడంతో వాహనాలు ఢీకొన్నాయి.
రంగారెడ్డి జిల్లా కొత్తూరు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకదాని వెనుక మరొక వాహనాలు ఢీకొన్నాయి. పొగమంచు కారణంగా రూట్ క్లియర్గా లేకపోవడంతో వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళుతున్న వాహనాలు కూడా భారీగా ఉండడంతో ఒక్కసారిగా ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు వచ్చి వాహనాలను పక్కకు తీసేసి ట్రాఫిక్ క్లియర్ చేసి వాహనాలను పంపించేశారు.