కోంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకుల మృతి

Update: 2019-07-31 06:10 GMT

మేడ్చల్ జిల్లాలోని కొంపల్లి వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులను వెనుకనుంచి వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు మృతిచెందారు. మృతులను విక్రమ్(22), ఇందా చంద్(22), దినేశ్(22)గా గుర్తించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై విచారించారు. డ్రైవర్‌ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్థారించారు.   

Tags:    

Similar News