జంటను నిర్బంధించి.. యువతిపై అత్యాచారం!

Update: 2019-07-21 06:58 GMT

ప్రకాశం జిల్లా కారంచెడులో దారుణం చోటు చేసుకుంది. చీరాలకు చెందిన వివాహిత భర్తతో విడాకులు తీసుకుని మరో యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి కారంచెడు సమీపంలోని ఓ వంతెనపై మాట్లాడుకుంటుండగా బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు వారిని నిర్బంధించారు. యువకునిపై దాడి చేసిన దుండగులు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇటు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కామాంధుల కోసం గాలిస్తున్నారు.  

Tags:    

Similar News