ప్రణయ్‌ హత్యకేసు ; చార్జిషీటు దాఖలు

Update: 2019-06-12 10:06 GMT

ప్రణయ్ హత్య కేసులో చార్జిషీట్ దాఖలైంది. గత ఏడాది సెప్టెంబరు 14న అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్‌ను దారుణంగా హత్య చేయించాడు. ఈ కేసుతో పాటు ఇంకా పలు కేసుల్లో నిందితులుగా ఉన్న మారుతీరావు, శ్రవణ్‌కుమార్, మరో నిందితుడు కరీం పీడీ యాక్ట్ కింద వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉంటూ బెయిల్‌పై బయటకొచ్చారు. ప్రణయ్ హత్య జరిగిన 9 నెలల తర్వాత మిర్యాలగూడ డిఎస్పీ ఆధ్వర్యంలో పక్కా ఆధారాలతో చార్జిషీట్‌ను కోర్టుకు అందజేశారు. హత్యజరిగిన 9 నెలల అంనంతరం చార్జిషీటు దాఖలు చేయడం గమనార్హం. 

Tags:    

Similar News