గుంటూరు జిల్లాలో గ్యాంగ్ రేప్‌ ఘటనపై దర్యాప్తు ముమ్మరం.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Update: 2020-02-18 06:14 GMT
గుంటూరు జిల్లాలో గ్యాంగ్ రేప్‌ ఘటనపై దర్యాప్తు ముమ్మరం

గుంటూరు జిల్లా చినకాకాని గ్యాంగ్ రేప్‌ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హాయ్ లాండ్ సమీపంలో మహిళపై ఈ ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే ఈ కేసులో ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి నిందితులను గోప్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు అవుతున్నా ఎస్‌ఐ ఉన్నతాధికారులకు చెప్పకుండా గోప్యంగా ఉంచుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. వివాహితపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు ఉన్నట్లు బాధితురాలి తరపువారు ఆరోపిస్తున్నారు.


Full View


Tags:    

Similar News