తిరుపతి కోర్టు ప్రాంగణంలో వైద్యుడిపై యాసిడ్ దాడి జరిగింది. స్ధానికంగా ఉన్న వైద్యుడు ఆదర్శ్రెడ్డిపై ఓ యువతి యాసిడ్తో దాడి చేసింది. దాడికి పాల్పడిన మహిళ ఆదర్శరెడ్డి దగ్గర నర్సుగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. భార్యతో విడాకుల కేసు విచారణ కోసం ఆదర్శ్ రెడ్డి కోర్టుకు వచ్చిన సమయంలో ఈ దాడి జరిగింది. తనను నమ్మించి మోసం చేయడం వల్లే దాడి చేసినట్టు మహిళ ఆరోపించింది. ఈ ఘటనలో ఆదర్శ్ రెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు.