ఉగ్రదాడిలో ఎమ్మెల్యే సహా 10 మంది మృతి

Update: 2019-05-21 14:37 GMT

అరుణాచల్ ప్రదేశ్ సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు మరో పది మందిని మిలిటెంట్లు హతమార్చారు. ఈ దారుణ ఘటన అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తిరాప్ జిల్లా బోగపని గ్రామంలో చోటుచేసుకుంది. నేడు అసోం నుంచి తన నియోజకవర్గమైన ఖోన్సాకు ఎమ్మెల్యే తిరోంగ్ అబో తన భద్రతా సిబ్బంది, మరో ఎనిమిది మందితో కలిసి వెళుతుండగా బొగాపాని వద్దకు రాగానే ఎన్‌ఎస్‌సీఎన్‌ అనుమానిత ఉగ్రవాదులు కాల్పులు జరిపారని ఆ ప్రాంత డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ పీఎన్‌ తుంగోన్‌ తెలిపారు. ఎన్‌పీపీ అధ్యక్షుడు, మేఘాలయా ముఖ్యమంత్రి కన్రాద్‌‌ సంగ్మా ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'ఈ వార్త తెలుసుకొని ఎన్‌పీపీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ దాడి జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, పీఎంవోను కోరుతున్నాం' అని ట్వీట్‌ చేశారు. 

Similar News