సిటీలో ప్రేమోన్మాది

Update: 2019-07-09 10:32 GMT

హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లో దారుణం జరిగింది. బృందావన్ లాడ్జ్ లో ఓ యువకుడు, యువతి గొంతు కోశాడు. నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేష్, హైదరాబాద్ బడంగ్ పేటకు చెందిన మనస్విని గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, ఇవాళ ఉదయం ఇద్దరు కలిసి బృందావన్ లాడ్జ్ లో రూమ్ అద్దెకు తీసుకున్నారు. మధ్యాహ్న సమయంలో యువతి గొంతు కోసి అనంతరం తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు వెంకటేష్. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు అత్యవసర విభాగంలో చికిత్స పొందుతుంది. 

Similar News