జవాన్ల వాహనాన్ని పేల్చేసిన మావోలు.. 15మంది మృతి

Update: 2019-05-01 09:30 GMT

మహారాష్ట్రలో మావోలు దారుణానికి పాల్పడ్డారు. గడ్చిరోలి జిల్లాలో జవాన్‌ల వాహనాన్ని పేల్చేశారు. జవాన్‌లు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీ మందుపాతర పెట్టి మావోలు పేల్చేశారు. ఈ ఘటన మహారాష్ట్రాలోని గడ్చిరోలిలో బుధవారం చోటుచేసుకుంది. భారీ విస్పోటనం కారణంగా వాహనం తునాతునకలైంది. ఈ ప్రమాదంలో 15 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. జాంబిర్‌కేడ అటవీ ప్రాంతం గుండా వెళ్తున్న క్రమంలో ఈ దారుణం జరిగింది. పేలుడు అనంతరం నక్సల్‌ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో ఎన్‌కౌంటర్‌ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News