విషమంగా మనస్విని పరిస్థితి..మరో 48 గంటలు దాటితే కానీ..

Update: 2019-07-09 14:16 GMT

హైదరాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. దిల్‌సుఖ్‌నగర్‌లో పట్టపగలే ఓ లాడ్జిలో యువతిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. స్ధానికంగా ఉన్న ఓ లాడ్జిలో మనస్విని అనే యువతిని గొంతుకోసి, ఆపై తానుకూడా ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు వెంకటేశ్ అనే యువకుడు. ప్రస్తుతం మనస్విని పరిస్థితి విషమంగా ఉంది. చైతన్యపురిలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో యువతి చికిత్స పొందుతోంది. ఘటనలో మనస్విని గొంతు లోతుగా తెగడంతో వైద్యులు అత్యవసరంగా సర్జరీ చేస్తున్నారు. మరో 48గంటలు దాటితే కానీ పరిస్థితి చెప్పలేమని వైద్యులు తెలిపారు. అయితే యువకుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన దిల్‌సుఖ్‌నగర్‌లోని బృందావన్‌ లాడ్జిలో జరిగింది. మంగళవారం ఉదయం నెల్లూరుకు చెందిన వెంకటేష్‌ అనే యువకుడు లాడ్జిలో రూమ్‌ అద్దెకు తీసుకున్నాడు. కాగా, మధ్యాహ్న సమయంలో తనతోపాటు ఉన్న ప్రియురాలి గొంతుకోసి హత్యాయత్నం చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. చైతన్యపురి పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Similar News