కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కొడవటికల్లు కోడిపందాల్లో అపశృతి చోటు చేసుకుంది. కోడి పందాల్లో పాల్గొన్న నందిగామకు చెందిన భట్టిప్రోలు రవి గుండెపోటుతో మృతి చెందాడు. చనిపోయే ముందు రవి రూ.5 వేలు పందెం కాశాడు. ఆపై గుండెపోటు రావడంతో రవిని 108లో నందిగామ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. కాగా ఇంత జరిగినప్పటికీ కోడి పందాలు మాత్రం ఆగకుండా కొనసాగుతున్నాయి.