పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్య

Update: 2019-06-22 08:59 GMT

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం లో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. రామన్నపాలెం గ్రామానికి చెందిన నాగంపల్లి శేఖర్‌, పోలవరం మండలానికి చెందిన పోచమ్మ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో నిన్న గురవాయిగూడెంలోని మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత రాత్రి ఓ ప్రైవేటు లాడ్జీలో బస చేశారు. తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసారు. అయితే శేఖర్ లాడ్జి లోనే మృతి చెందగా జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పోచమ్మ ప్రాణాలు కోల్పోయింది.  

Tags:    

Similar News