క్లాస్ రూమ్ లో ప్రేమజంట ఆత్మహత్య

Update: 2019-05-16 10:17 GMT

సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కనకయ్య, తార అనే ప్రేమ జంట… స్థానిక ప్రభుత్వ పాఠశాలలోని క్లాస్ రూమ్ లో ఉరి వేసుకొని అత్మహత్యకు పాల్పడ్డారు. లకుడారం గ్రామానికి చెందిన మండే కనకయ్య, రాచకొండ తారా గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో మందలించారు. అయినా కనకయ్య, తార మధ్య ప్రేమ మాత్రం తగ్గలేదు. కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాల్లో వీరి పెళ్లికి ఒప్పుకోరని భావించి ఆ గ్రామంలోని స్కూల్‌కు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న కుకునూరుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Similar News