మెదక్ జిల్లాలో విషాదం ... ప్రేమజంట ఆత్మహత్య

Update: 2019-02-17 10:08 GMT

మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెద్దలు పెళ్లికి నిరాకరించారని ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామానికి చెందిన బాలేష్ రాయపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలిసిన బాలేష్ తల్లిదండ్రులు అతన్ని పని మాన్పించారు. దీంతో పెద్దలు తమ వివాహానికి అడ్డు పడుతారనే ఆందోళనతో ఇద్దరు ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. అటవీ ప్రాంతంలో ఇద్దరు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Full View 

Similar News