కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కాంగ్రెస్కు ఇటీవల రాజీనామా చేసిన కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వైసీపీలో చేరేందుకు అనుచరులతో కలిసి భారీ కాన్వాయ్తో కడప వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనడంతో ముగ్గురు వైసీపీ కార్యకర్తలు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.