ఆయన్నే పెళ్లి చేసుకుంటా... విచారణలో కీలక విషయాలు బయటపెట్టిన కీర్తి

Update: 2019-11-02 06:17 GMT

కన్నతల్లిని అమానుషంగా హతమార్చిన కీర్తి కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కీర్తి మొదటి ప్రియుడు బాల్‌రెడ్డి పెళ్లి చేసుకుంటానని వెల్లడించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 16ఏళ్ల వయస్సులు బాల్‌రెడ్డిని ప్రేమించింది. ప్రతీ విషయాన్ని అతనికి చెప్పుకునేది. కీర్తి తల్లి ఇంట్లోలేనప్పుడు బాల్‌రెడ్డి ఇంటికి ఒంటరిగా వెళ్లేది. గత సంవత్సరం బాల్‌రెడ్డి వలన కీర్తి గర్భం దాల్చింది. దీంతో కీర్తికి అనుమానం వచ్చి గర్భం వల్ల వచ్చే మూర్పులను ఇంటర్నెట్ లో పరిశోధించింది. నిర్ధారించుకొని ఆమె సన్నిహితుడు  శశికుమార్ కు పూర్తి వివరాలు చెప్పింది. శశికుమార్ ఇంటికి ల్వాబ్ టెక్నికల్ సిబ్బంది వచ్చి కీర్తికి పరీక్షలు నిర్వహించారు. దీంతో కీర్తి గర్భవతి అని ఆమెకు నాలుగో నెల అని వారు చెప్పారు. అయితే బాల్‌రెడ్డి మాత్రం బెంగళూరులో ఉన్నాడు.

కీర్తి గర్భవతి అని తెలిసిన బాల్‌రెడ్డి బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చాడు. కీర్తికి అబార్షన్ చేయించాలని దాని కోసం ఆసుపత్రులకు సంప్రదించారు. దీంతో వైద్యులు రెండు రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. శశికుమార్ సాయం తీసుకున్నారు. బాల్‌రెడ్డి, శశికుమార్, కీర్తి కలిసి కొంత దూరం కారులో వెళ్లారు.  ఆమన్ గల్ దగ్గరలో శశికుమార్ కారు దిగాడు వెళ్లిపోయాడు. కీర్తి, బాల్ రెడ్డి మాత్రమే ఆమన్‌గల్ ఓ క్లినిక్‌లో చేరుకున్నారు. బాల్ రెడ్డి ఆమన్‌గల్ లోని  తన మిత్రుడు నాయక్ సాయం తీసుకొని కీర్తికి అబార్షన్ చేయించారు.  అనంతరం అక్కడే రెండు రోజులు విశ్రాంతి తీసుకొని తిరిగి బయల్దేరారు.

ప్రియుడితో కలిసి కన్నతల్లి రజితను హత్య చేసే సమయంలో కీర్తి మద్యం మత్తులో ఉన్నానని పోలీసులకు తెలిపినట్లు సమాచారం. కీర్తి మాటలు విన్న పోలీసులు ఆమె ప్రవర్తన, మాటతీరు చూసి అవాక్కయ్యారు. జైలుకు వెల్లేముందు కూడా ఆమె పోలీసులకు బైబై మళ్లీ కలుస్తా అని చెప్పడం చూసి వారు విస్తుపోయారు.

Tags:    

Similar News