కథువా కంత్రీలకు శిక్షలు ఖరారు

Update: 2019-06-10 11:29 GMT

కథువా అత్యాచారం కేసులో పఠాన్ కోట్ ‌న్యాయస్ధానం శిక్షలు ఖరారు చేసింది. ఈ కేసులో మొత్తం ఆరుగురిని దోషులుగా నిర్ధారించిన న్యాయస్ధానం A 1 సాంజీరామ్‌‌, A2 దీపక్‌ ఖజూరియా , A3 కపిల్‌‌ రాజ్‌‌ లకు జీవిత ఖైదు విధించింది. మిగిలిన ముగ్గురికి ఐదేళ్ల కారాగార శిక్ష విధించింది. జీవత ఖైదుకు గురయిన వారిలో గ్రామ పెద్దతో పాటు మిగిలిన ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారు. భూవివాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్టు నిర్ధారించిన దర్యాప్తు బృందం కేసు వివరాలు బయటకు రాకుండా స్ధానిక పోలీసులు ప్రయత్నించినట్టు చార్జ్‌షీట్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి తగిన ఆధారాలు కోర్టుకు సమర్పించడంతో నిందితులకు శిక్షలు పడ్డాయి.  

Tags:    

Similar News