మంగళగిరిలో జ్యోతి హత్యకేసులో ప్రియుడే హంతకుడని తేల్చారు. పక్కా ప్లాన్తో జ్యోతిని హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. జ్యోతి ప్రియుడు శ్రీనివాస్తో పాటు హత్యకు సహకరించిన మరో నిందితుడిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు.
జ్యోతిని హత్య చేసేందుకు శ్రీనివాస్ పవన్ కల్యాణ్ సహకారం తీసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ముదస్తు ప్లాన్ ప్రకారం ఘటనా స్థలానికి చేరకున్న పవన్ కల్యాణ్ జ్యోతిపై రాడ్తో దాడి చేశాడు. ఆ తర్వాత శ్రీనివాస్ జ్యోతి తలపై రాడ్డుతో బలంగా కొట్టి చంపాడు. అదే రాడ్డుతో తన తలపై పవన్ చేత కొట్టించుకున్నాడు. ఎవరో వచ్చి దాడి చేశారని శ్రీనివాస్ కథలు అల్లినట్టు పోలీసులు తేల్చారు.