ఇంటర్‌ విద్యార్థి గొంతుకోసిన దుండగులు..!

Update: 2019-03-12 06:16 GMT

నల్లగొండలో దారుణం జరిగింది. పాలిటెక్నిక్ కాలేజీ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంటర్ విద్యార్థి గొంతుకోసి పరారయ్యారు. రాత్రంతా అక్కడే పడివున్న విద్యార్థిని మార్నింగ్ వాకర్స్ గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విద్యార్థి మాచర్ల తరుణ్‌ కుమార్‌ను ఆస్పత్రికి తరలించారు. స్థానిక ప్రగతి కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు తరుణ్‌ కుమార్‌. నిన్న పరీక్ష రాసిన అనంతరం ఫ్రెండ్ ఇంటికి వెళ్లొస్తానని చెప్పి హాస్టల్ నుంచి బయటకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Similar News