భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

Update: 2019-08-31 07:19 GMT

విజయవాడ రూరల్ మండలం నిడమానూరు రామ్‌నగర్‌లో భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. లారీ డ్రైవర్‌గా పని చేసే సోమేలు గత రాత్రి భార్య అశ్వినితో గొడవ పడి ఇంట్లో నుంచి బయటికి వెళ్లాడు. ఇవాళ ఉదయం ఇంటికి వచ్చిన సోమేలు రాగానే రోకలి బండతో అశ్విని తలపై గట్టిగా కొట్టడంతో ఆమె అక్కడిక్కడే చనిపోయింది. వివాహేతర సంబంధం కారణంతోనే ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. పోలీస్‌ స్టేషన్‌లో ఫొటోలతో చూపించి సోమేలు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు.

Tags:    

Similar News