ప్రకాశం జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతోంది. ప్రేమ పెళ్లి చేసుకుందనే ఆగ్రహంతో కన్నకూతురినే పొట్టన పెట్టుకున్నాడు ఓ తండ్రి. తాళ్లూరు మండలం కొత్తపల్లికి చెందిన వైష్ణవి లింగసముద్రానికి చెందిన సునీల్ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇతర కులస్తుడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో కూతురు అని కూడా చూడకుండా గొంతు నులిమి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.