లారీని ఢీకొన్న కారు.. ముగ్గురి దుర్మరణం

Update: 2019-04-05 09:02 GMT

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం తెట్టు వద్ద ఆగివున్న లారీని కారు ఢీకొన్నది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా, అప్పటికే ముగ్గురు చనిపోయినట్లు నిర్ధారించిన వైద్యులు, మరొకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. బాధిత కుటుంబం విశాఖ నుంచి తిరుపతికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.  

Similar News