భార్య పుట్టింటికి వెళ్లిందని.. పిల్లలను హతమార్చాడు!

Update: 2019-04-17 05:36 GMT

సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య పుట్టింటికి వెళ్లిపోయిందన్న కోపంతో కన్న బిడ్డల్ని కడతేర్చాడో కసాయి తండ్రి. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురంలో మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. రామచంద్రాపురం బొంబై కాలనీలో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. అయితే మద్యానికి బానిసైన భర్త తన భార్యను తీవ్రంగా వేధించేవాడు. దీంతో నెలరోజుల క్రితం భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చిన నిందితుడు ముగ్గురు చిన్నారులను కత్తితో హతమార్చేందుకు యత్నించాడు. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు అఖిల్(7), శరణ్య(4) మృతి చెందగా మరో చిన్నారి మల్లీశ్వరి(10)కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన చిన్నారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Similar News