బర్త్‌డే కేక్ తిని.. ఇద్దరు మృతి

బర్త్ డే కేక్ తిని ఇద్దరు ప్రాణాలు కొల్పోయిన ఘటన సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం ఐనాపూర్‌లో చోటుచేసుకుంది.

Update: 2019-09-05 04:43 GMT

బర్త్ డే కేక్ తిని ఇద్దరు ప్రాణాలు కొల్పోయిన ఘటన సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం ఐనాపూర్‌లో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే.. ఐనాపురం గ్రామానికి చెందిన రమేష్(39), భాగ్యలక్ష్మిల(35) కుమారుడు రాంచరణ్(9) పుట్టిన రోజు సందర్భంగా కేక్ తీసుకొచ్చారు. కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి అందరికి తినిపించాగా.. ఆ కేకే ముక్క తిన్న కొద్దిసేపటికే రాంచరణ్, తండ్రి రమేష్ మృతి చెందారు.

అదే కేక్ తిన్న తల్లి భాగ్య, కూతురు పూజ పరిస్థితి విషమంగా ఉండటంతో.. వారిద్దరినీ సిద్దిపేట ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.అయితే బర్త్ డే కేక్ పంపించింది రమేష్ సోదరుడు ఇంటికి పంపించినట్టు తెలుస్తోంది. అయితే ఇద్దరు అన్నదమ్ముల మధ్యకొద్దికాలంగా భూవివాదంలో గోడవలు వచ్చిన నేపథ్యంలో రమేష్ సోదరుడే కేక్‌లో విషం కలిపి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

Tags:    

Similar News