పుట్టింటికి వెళ్లిపోయిన భార్య.. మత్తు ఇంజక్షన్ తీసుకొని డాక్టర్ ఆత్మహత్య

Update: 2019-11-13 06:17 GMT

రోగులకు మత్తు ఇంజక్షన్‌ ఇచ్చే ఓ డాక్టర్‌ తానే మత్తు ఇంజక్షన్‌ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పరిధిలోని లెక్చరర్స్‌ కాలనీలో డాక్టర్ రమేష్ నివాసం ఉంటున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఓబుల్‌రెడ్డి ఆసుపత్రిలో అనస్తీషియన్‌గా పనిచేస్తున్నారు. అతని భార్య స్వప్న కిమ్స్‌ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తుంది. వీరికి ఒక కొడుకు ఉన్నాడు.

కొంతకాలంగా డాక్టర్ రమేష్ దంపతుల మధ్య వివాదం నడుస్తోంది. గత ఆరు నెలలుగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. రమేష్‌ లెక్చరర్స్‌ కాలనీలో తల్లిదండ్రుల వద్ద ఉంటుండగా స్వప్న బీహెచ్‌ఈఎల్‌లోని ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. భార్య తీరుతో మనస్తాపం చెందిన డాక్టర్ రమేష్ ఇంటి డాబాపైకి వెళ్లి మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.



 

Tags:    

Similar News