హైదరాబాద్ రామంతాపూర్లో వేరే మహిళతో కలిసి ఉంటున్న భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది ఓ భార్య. కృష్ణమాచారి అనే క్రిమినల్ లాయర్కు రాజస్థాన్లో మెడికల్ ఆఫీసర్ అయిన వింధ్యారాణితో 2008లో వివాహమైంది. విఆర్ఎస్పై వచ్చిన వింధ్యారాణి వేరే మహిళతో వివాహేతర సంబంధం నడుపుతున్న భర్త రామాంతపూర్లో ఓ అపార్టుమెంట్లో ఉండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకుని షీ టీంకు వారిని అప్పగించింది. పోలీసుల విచారణలో లాయర్ కృష్ణమాచారి.. పెళ్లి పేరుతో అనేక మంది మహిళలను మోసం చేసినట్లు తెలిసింది.