పోలీసుల విచారణ భయంతో దంపతుల ఆత్మహత్య

Update: 2019-01-31 06:57 GMT

పోలీసుల విచారణకు భయపడి దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరులో కలకలం రేపుతోంది. మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన కిరణ్‌ విజయవాడలో జాబ్‌ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశాడంటూ కిరణ్‌పై ఓ యువకుడు కొండపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువకుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిన్న ఉదయం కిరణ్‌ను విచారించారు. దీంతో భయాందోళనకు లోనైన కిరణ్‌ అర్థరాత్రి సమయంలో భార్య హెలీనాతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

Similar News