అయేషా హత్య కేసు...దూకుడు పెంచిన సీబీఐ

Update: 2019-01-18 07:08 GMT
ayesha meera

సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. నందిగామ సమీపంలోని అనాసాగరంలోని సత్యంబాబు ఇంట్లో ఆయనను సీబీఐ అధికారులు ఉదయం నుంచి విచారిస్తున్నారు. సత్యంబాబుతో పాటు ఆయన కుటుంబసభ్యుల స్టేట్ మెంట్స్ ను రికార్డు చేస్తున్నారు. అలాగే ఇబ్రహీంపట్నంలోని శ్రీ దుర్గా హాస్టల్ యాజమానిని కూడా సీబీఐ విచారించనుంది. ఈ కేసులో ఇప్పటికే విజయవాడ కోర్టుకు చెందిన ముగ్గురు కోర్టు సిబ్బందిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసు డాక్యుమెంట్లు, సాక్ష్యాలు ధ్వంసం అయిన అంశంపై పి.కుమారి, పి. వెంకటకుమార్‌, వై సుబ్బారెడ్డిలపై కేసు​ నమోదు చేశారు. 

Similar News