అంబులెన్సును ఢీకొట్టిన కారు...అక్కడికక్కడే ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లాలో అంబులెన్స్ ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదం ముగ్గురు చనిపోయారు. మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉంది. రావిరాల ఔటర్ రింగ్‌ రోడ్డుపై శంషాబాద్‌ నుంచి బొంగులూరు వైపు వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పింది.

Update: 2019-01-11 05:11 GMT
orr

రంగారెడ్డి జిల్లాలో అంబులెన్స్ ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదం ముగ్గురు చనిపోయారు. మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉంది. రావిరాల ఔటర్ రింగ్‌ రోడ్డుపై శంషాబాద్‌ నుంచి బొంగులూరు వైపు వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పింది. ఎదురుగా వస్తున్న అంబులెన్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళుతున్న వాహనదారులు ప్రమాదాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వచ్చిన పోలీసులు గాయపడిన వారినికి ఆసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. కారు డ్రైవర్ నిద్ర మత్తులో వాహనాన్ని నడపడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News