శంషాబాద్ ఎయిర్ పోర్టులో కిడ్నాప్ కలకలం

Update: 2019-08-02 07:33 GMT

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో కిడ్నాప్ కలకలం రేగింది. ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ఫ్యామిలి ఇంటికి వెళ్లేందుకు వేర్వేరుగా క్యాబ్‌లు బుక్ చేసుకుంది. అయితే పిల్లలున్న క్యాబ్‌ను మరో మార్గంలో తీసుకెళుతుండగా తల్లిదండ్రులు ఆలస్యంగా గుర్తించారు. తాము వెళుతున్న క్యాబ్‌లో వెంటాడి డ్రైవర్‌ను పట్టుకున్నారు. అనంతరం శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు.     



Tags:    

Similar News