హరియాణా గురుగ్రామ్లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద 12 మంది వరకు చిక్కుకున్నట్టు సమాచారం. విషయం తెలిసిన వెంటనే ఎన్టీఆర్ఎఫ్కు చెందిన మూడు బృందాలు రంగంలోకి దిగాయి. ప్రత్యేక యంత్రాల ద్వారా శిథిలాల తొలగింపును ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.