చాక్లెట్‌ తిని బాలుని మృతి

Update: 2019-07-15 10:38 GMT

చాక్లెట్‌ తిని ఒక బాలుడు మృతి చెందగా, మరో ఇద్దరకు బాలురు చికిత్స పొందుతున్న ఘటన సోమవారం రాయిగూడెంలో చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి బుట్టాయిగూడెం మండలం రాయిగూడెంలో చాక్లెట్‌ తిని.. ముగ్గురు బాలురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో అభిచరణ్‌ తేజ (5) మఅతి చెందగా, కట్టం సంతోష్‌ (7), మండలం రాహుల్‌ (6) అనే ఇద్దరినీ చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News