అనంతలో దారుణం...అక్కపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తమ్ముడు

Update: 2019-02-08 07:52 GMT

అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం పొడరాళ్లలో దారుణం జరిగింది. సెల్ ఫోన్ చార్జీంగ్ విషయంలో అక్క తమ్ముడు ఘర్షణ పడ్డారు. అక్కపై తమ్ముడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ప్రమాదంలో గాయపడ్డ యువతిని ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి వాంగ్మూలం కూడా రికార్డు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News