భర్తపై కేసు పెట్టిందని ముక్కు కోశారు..

Update: 2019-08-08 11:17 GMT

ట్రిపుల్ తలాక్ ని భారత ప్రభుత్వం రద్దు చేసిన ఇంకా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ట్రిపుల్ తలాక్ వలన కొందరు మహిళలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు . తాజాగా ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది . ఓ భర్త తన భార్యకు ఫోన్ లో మూడు సార్లు తలాక్ చెప్పి ఆమెను వదిలించుకోవాలని ప్రయత్నం చేసాడు . కానీ ఆమె దైర్యంగా ఈ విషయాన్ని పోలీసులకు వివరించింది . దీనితో అ కేసును వెనుకకి తీసుకోవాలని ఆమెను కోరారు . అందుకే ఆమె అంగీకరించకపోవడంతో ఆమెపై దాడి చేసారు . ఈ క్రమంలో ఆమె ముక్కును కోశారు . ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది . దీనితో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసారు . 

Tags:    

Similar News