జూదంలో ఓడిపోయాడు ... భార్యను అప్పగించాడు

Update: 2019-08-02 11:44 GMT

మహాభారతంలో జూదం సిన్ గుర్తుండే ఉంటుంది కదా .. ! జూదంలో ధర్మరాజు రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలు చేస్తుంది . అంతే కాకుండా అదే జూదంలో అన్ని కోల్పోయి పాండవులు ద్రౌపదిని పందెంలో పెడతారు . అ సభలో పాండవులు ఓడిపోయి కౌరవులు నేగ్గుతారు .. ద్రౌపదికి అక్కడ అవమానం ఎదురవుతుంది . ఇప్పుడు ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది .

ఉత్తరప్రదేశ్ లోని జౌన్పూరు జిల్లాలోని జఫరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. మద్యంతోపాటు జూదానికి కూడా బాగా అలవాటు పడ్డాడు. అయితే ఒకరోజు తన స్నేహితుడు మరియు బంధువు మరికొంత మంది కలిసి జూదం ఆడారు. ఇందులో అతను అన్ని కోల్పోవడంతో తన భార్యను జూదంలో పెట్టాడు .

దురదృష్టవశాత్తూ అ పందెంలో అతను ఓడిపోయాడు. దీనితో తన భార్యను అప్పగించాల్సి వచ్చింది. దీనితో అతని భార్యపై స్నేహితుడు భార్య మరియు బంధువు భార్య అని చూడకుండా పెకటా పెకటే అన్న రీతిలో ఆమె పై అందరు కలిసి లైంగిక దాడి చేసారు. అయతే భర్త చేసిన పనిని ఆమె పోలిస్ స్టేషన్ లో కంప్లేంట్ చేసింది. అయిన పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఆమె తిరిగి కోర్టును ఆశ్రయించడంతో విషయం బయటకు వచ్చింది .

Tags:    

Similar News