క్రికెట్ మ్యాచ్ ఒకరి ప్రాణం తీసింది ...

Update: 2019-08-14 06:37 GMT

సరదాగా ఆడుకున్న క్రికెట్ మ్యాచ్ ఒకరి ప్రాణాన్ని తీసింది . ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది . ఇక వివరాల్లోకి వెళ్తే ఎం.విజయ్‌ (13) మరియు అతని స్నేహితుడు (14) ఆదివారం క్రికెట్‌ మ్యాచ్ ఆడుకున్నారు.. అయితే మ్యాచ్ లో భాగంగా ఇద్దరి తగువు రావడంతో ఘర్షణకి దిగారు . ఈ క్రమంలో ఆవేశంతో విజయ్ స్నేహితుడు క్రికెట్ బ్యాట్ తో విజయ్ ని కడుపులో పొడిచాడు . దీనితో లోపలి పేగుల్లో రక్త ప్రసరణ నిలిచి పోయి విజయ్‌ ఒక్కసారిగా కింద పడిపోయాడు .. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు . విజయ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనితో విజయ్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ..  

Tags:    

Similar News