అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓ బ్యాంకులో దుండగుడు కాల్పులు జరిపాడు. సెబ్రింగ్ నగరంలోని సన్ ట్రస్ట్ బ్యాంకులోకి వెళ్లిన దుండగుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ఐదుగురు పౌరులు మృతిచెందారు. దుండగుడిని సెబ్రింగ్కు చెందిన 21 ఏళ్ల జీపెన్ జావర్గా పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సెబ్రింగ్ పోలీస్ అధికారి కార్ల్ హోగ్లాండ్ తెలిపారు. కాల్పులకు దారి తీసిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.