మేడారంలో బాలుడు మిస్సింగ్‌.. జాతర ముగిసినా దొరకని ఆచూకీ !

Update: 2020-02-10 05:21 GMT
మేడారంలో బాలుడు మిస్సింగ్‌.. జాతర ముగిసినా దొరకని ఆచూకీ !

మేడారం జాతరలో బాలుడి మిస్సింగ్‌ మిస్టరీగా మారింది. జాతర ముగిసినా ఇప్పటి వరకు బాలుడి ఆచూకీ లభించడం లేదు. పెద్దపల్లి జిల్లా కన్నాల గ్రామానికి చెందిన విన్నూ అనే మూడేళ్ల బాలుడు మేడారం జాతరలో మిస్సాయ్యాడు. పిల్లల్ని ఎత్తుకెళ్లే మహిళా ముఠా బాలున్ని జాతరలో నుంచి అపహరించుకుపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.

బాలుడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. బాలుడు కనిపించకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేడారంలో పట్టుబడ్డ ఓ మహిళను పోలీసులు విచారిస్తున్నారు.


Full View


Tags:    

Similar News