ఘోర ప్రమాదం: 11మంది దుర్మరణం

Update: 2019-06-27 13:41 GMT

జమ్మూకాశ్మీర్‌ సోపియాన్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రయాణీకులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సోపియాన్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద ఘటనపై జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News