మీర్‌పేటలో కిడ్నాప్ కలకలం..బాలుడిని కిడ్నాప్ చేసిన మరో మైనర్ బాలుడు

మూడు లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్ కాల్ డేటా ఆధారంగా కిడ్నాపర్‌ను పట్టుకున్న పోలీసులు

Update: 2019-11-18 05:43 GMT
10th student kidnap a boy in meerpet

హైదరాబాద్ మీర్‌పేటలో కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. టీఎస్ఆర్ కాలనీలో రాజ్ కుమారుడు ఏడు సంవత్సరాల అర్జున్ ఇంటి వద్ద ఆడుకుంటుండగా.. కిడ్నాప్ చేశారు. చందుకు ఫోన్ చేసి మూడు లక్షలు డిమాండ్ చేశారు. చందు ద్వారా విషయం తెలుసుకున్న తండ్రి రాజు పోలీసుకు ఫిర్యాదు చేశాడు. లోకేషన్ ఆధారంగా పోలీసులు కిడ్నాపర్ నిందితుడిని మూడుగంటల్లో పట్టుకున్నారు. మైనరైన నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తమ బాబును కిడ్నాప్ చేసి డబ్బులు కావాలని డిమాండ్ చేశాడని బాలుడి తండ్రి వెల్లడించాడు. డబ్బులు ఇవ్వకుంటే మీ కొడుకు మీ ఇంటికి ఎప్పటికి రాడని హెచ్చరించారని చెప్పాడు. ప్రతి 30 నిమిషాలకు ఓసారి ఫోన్ చేసి డబ్బుల కోసం డిమాండ్ చేశాడని చెప్పారు. పోలీసుల సలహా మేరకు డబ్బులు సిద్ధం చేసుకున్నామని,ఎక్కడికి రావాలని చెప్పినట్లు తెలిపారు. పోలీసులకు విషయం చెప్పడంతో వారు కిడ్నాపర్‌ను పట్టుకున్నారని చెప్పారు. వేరే ప్రాంతంలో ఉన్న బాబును తీసుకువచ్చారన్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో బయట ఆడుకుంటున్న పిల్లలు కిడ్నాప్‌కు గురి కావడం తల్లిదండ్రులను ఆందోళన పరుస్తోంది. కిడ్నాప్‌లకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
 

Full View 

 

Tags:    

Similar News