నిండు ప్రాణం బలి తీసుకున్న ఫేస్‌బుక్ పరిచయం

Update: 2019-08-29 06:52 GMT

ఫేస్ బుక్‌ పరిచయం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మహబూబ్ నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం శంకరాయపల్లి వద్ద బాలిక హర్షిణి దారుణ హత్యకు గురైంది. రవిశంకర్ జడ్చర్ల తహశీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తూ హౌసింగ్ బోర్డులో నివాసం ఉంటున్నాడు. కుమార్తె హర్షిణి మహబూబ్ నగర్‌లోని కేంద్రీయ విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది.

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన నవీన్ రెడ్డి ఫేక్ ఫేస్ బుక్ ఐడీ ద్వారా పరిచయం అయ్యాడు. ఈ నెల 27న జడ్చర్లకు వచ్చి బాలికకు మాయమాటలు చెప్పి సమీపంలో శంకరాయపల్లి తండాలోని నిర్మానుష్య ప్రాంతానికి కారులో తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెను లోబర్చుకునేందుకు ప్రయత్నించగా ప్రతిఘటించింది. దీంతో బండరాయితో కొట్టి హత్యచేశాడు. మృతిరాలి ఇంటి సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితుడిని విచారించగా హత్యచేసినట్లు అంగీకరించడాడు. గురువారం తెల్లవారుజామున పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బాదేపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News