హైదరాబాద్ రాజేంద్రనగర్లో విషాదం చోటుచేసుకుంది. ఓ బాలుడు ఆడుకుంటూ మృతి చెందాడు. జనప్రియ అపార్ట్మెంట్లోని పార్క్లో ఈ ఘటన చోటుచేసుకుంది. నిశాంత్ శర్మ అనే బాలుడు సిమెంట్ బెంచ్పై ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా కిందపడిపోయాడు సిమెంట్ బెంచ్ ఆ బాలుడిపై పడటంతో తలకు తీవ్ర గాయమైంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.