వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉదయం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు. విభజన హామీలను అమలు చేయాలని వారు హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు. వైసీపీ ఎంపీల డిమాండ్ పై రాజ్ నాథ్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఈ భేటీలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వరప్రసాద్, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డిలు పాల్గొన్నారు. టీడీపీ ఎంపీలు ఆందోళన ఉపసంహరించుకున్నా, పట్టువీడకుండా వైఎస్ఆర్సీపీ ఎంపీలు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.